Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్లో (IPL) భాగంగా శుక్రవారం ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal
Challengers Bengaluru) ఓటమి చవిచూసింది. ఇప్పుడు పరాజయం పాలైందే మేలని మ్యాచ్ అనంతరం ఆర్సీబీ బ్యాటర్ ఫిల్సాల్ట్ అభిప్రాయపడ్డాడు. ‘మేం ఇప్పటికే ప్లేఆఫ్స్నకు అర్హత సాధించాం. మ్యాచ్లో
ఓడిపోవడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓటమి చవిచూడటం కంటే.. ఈ మ్యాచ్లో ఓడిపోవడమే ఉత్తమం’ అని ఫిల్సాల్ట్.. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో అన్నాడు. సన్రైజర్స్
హైదరాబాద్ నిర్దేశించిన 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 189 రన్స్కే ఆలౌటైంది. దీంతో హైదరాబాద్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ కారణంగా పాయింట్ల పట్టికలో దూసుకెళ్లే
అవకాశాన్ని ఆర్సీబీ చేజార్చుకుంది. బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచుల్లో ఎనిమిదింట్లో విజయం సాధించింది. ప్రస్తుతం 17 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో ఉంది. లీగ్ దశలో ప్లేఆఫ్స్నకు
ముందు ఆర్సీబీ తన చివరి మ్యాచ్ను మే 27న లఖ్నవూ సూపర్ జెయింట్స్తో (Lucknow Super Giants) ఆడనుంది.