Jyoti malhotra: ఉగ్ర దాడికి ముందు పహల్గాంకు.. జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు

Jyoti malhotra: ఉగ్ర దాడికి ముందు పహల్గాంకు.. జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే విషయాలు

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా (Youtuber Jyoti Malhotra) కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో


ఉగ్రదాడి (Pahalgam Terror Attack) జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇక, పాకిస్థాన్‌ ఐఎస్‌ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్‌ ఉద్యోగి డానిష్‌తో


జ్యోతికి సన్నిహిత సంబంధాలున్నట్లు తెలిసింది. ఏప్రిల్‌ 22న పహల్గాంలో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు


సమాచారం. ఆ సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. * హైదరాబాద్‌లోనూ జ్యోతి మల్హోత్రా జాడలు గూఢచర్యం


ఆరోపణల కింద గతవారం జ్యోతిని హరియాణా పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు బయటికొచ్చాయి. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించిందని, ఒకసారి చైనాకూ


వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె దిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు.


జ్యోతిని అతడు ట్రాప్‌ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్‌, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్‌ విత్‌ జో (Travel With Jo) పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తోంది. 2023లో పాక్‌కు


వెళ్లిన సమయంలో డానిష్‌ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్‌కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు.. అలీ అహ్సాన్‌ అనే వ్యక్తిని ఆమె


కలిసింది. అతడు పాక్‌ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్‌ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు


ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా భారత్‌లో నిలిపివేశారు.