Rishabh pant: కొన్ని రోజులు క్రికెట్‌ గురించి ఆలోచించడం మానేస్తా: రిషభ్‌ పంత్‌

Rishabh pant: కొన్ని రోజులు క్రికెట్‌ గురించి ఆలోచించడం మానేస్తా: రిషభ్‌ పంత్‌

Play all audios:

Loading...

భారతజట్టు త్వరలో ఇంగ్లండ్‌ టూర్‌ మొదలుపెట్టనుంది. దానిలో అయిదు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్ని రోజులు క్రికెట్‌ గురించి ఆలోచించడం మానేస్తానని పంత్‌ అంటున్నాడు.


ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతజట్టు (Team India) త్వరలోనే ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో తాను కొన్ని రోజులు క్రికెట్‌ గురించి ఆలోచించడం మానేస్తానని పంత్‌ (Rishabh Pant) అంటున్నాడు. చిన్న


విరామం తర్వాత తిరిగి ఇంగ్లండ్‌తో అయిదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం సన్నద్ధమవుతా అని వివరిస్తున్నాడు. ఇంగ్లండ్‌ టూర్‌ నేపథ్యంలో ఇటీవలే భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. కెప్టెన్‌గా


శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill), వైస్‌ కెప్టెన్‌గా రిషభ్‌ పంత్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ (Lucknow Supergiants) తరఫున పెద్దగా రాణించని


పంత్‌ మంగళవారం ఆర్సీబీతో (Royal Challengers Bengaluru) జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదాడు. 61 బంతుల్లో 118 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు తిరిగి లయ అందుకోవడం


టీమ్‌ఇండియాకు శుభపరిణామం అని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  ‘ఐపీఎల్‌ సీజన్‌ త్వరలో ముగియబోతోంది. తర్వాత టీమ్ఇండియా, ఇంగ్లండ్‌ పర్యటన ప్రారంభం కాబోతోంది. ఈ నేపథ్యంలో నేను కొద్ది


రోజులు క్రికెట్‌ ఆలోచనల నుంచి దూరంగా ఉంటా. తర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్‌లకు సన్నద్ధమవుతా. ప్రతి మ్యాచ్‌లోనూ బాగానే ఆడాలని అనుకుంటాను. కానీ అన్నిసార్లూ అలా జరగదు. ఆర్సీబీతో మ్యాచ్‌లో నాకు మంచి


ప్రారంభం లభించింది. దాన్ని నేను భారీ స్కోర్‌గా మలచాలి అనుకున్నాను. అలాగే నేను ఇప్పటికీ ఉత్తమ ఆటగాళ్ల నుంచి నిరంతరం నేర్చుకుంటూనే ఉంటా’ అని రిషభ్‌ పంత్‌ తన మనసులోని మాటల్ని బయటపెట్టాడు.