జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మినీ మహానాడు వేడుకలు

జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో మినీ మహానాడు వేడుకలు

Play all audios:

Loading...

ఫ్రాంక్‌ఫర్ట్‌: జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్‌లో మినీ మహానాడు వేడుకలు విజయవంతమైనట్లు ఎమ్మెల్యే గౌతు శిరీష, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు అన్నారు. అక్కడ జరిగిన ముగింపు వేడుకల్లో


పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. ఇందుకు కృషిచేసిన తెలుగుదేశం విభాగం, వివిధ కమిటీల సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ.. ఫ్రాంక్‌ఫర్ట్ మహానాడు


వేడుకలు విజయవంతానికి కృషిచేసిన ప్రతిఒక్కరికి అభినందలు తెలియజేశారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. పీ-4 కార్యక్రమం గురించి పలువురు ప్రవాసాంధ్రులు ఉత్సాహంగా ఉన్నారన్నారు. అనంతరం శ్రీకాంత్


కుడితిపూడి మాట్లాడుతూ.. అమెరికాకు ద్వారాలు మూసుకుపోవడంతో ఎక్కువ మంది జర్మన్ దేశం వైపు మొగ్గుచూపుతున్నారని, రాష్ట్రంలోనే జర్మన్ భాషను నేర్చుకుని రావడం వల్ల ఇక్కడ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు


సులువుగా లభిస్తాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు సుమంత్ కొర్రపాటి, కళ్యాణ్ సుంకు, రాజశేఖర్, ఫుడ్ కమిటీ సభ్యులు వంశీ ఉండవల్లి, దినేష్ కోవి, నరేంద్ర నాదెళ్ళ, మహేంద్ర


కొండారెడ్డి, వెంకట్ ఖాండ్ర, నరేష్ కోనేరు, దినేష్ పాకలపాటి, ఫుడ్ సర్వింగ్ కమిటీ సభ్యులు మనోజ్ గుట్లపల్లి, కొండలరావు గుట్లపల్లి, కిషోర్ నల్లపాటి, హరి గుడ్ల, మారుతి, శశిధర్ అమ్మిరెడ్డి,


హాస్పిటాలిటీ కమిటీ సభ్యులు అనుదీప్ మేదరమెట్ల, ఫర్హత్ మిర్జా, సుజాత, సుచరిత, శివాని, అఖిల్, ప్రసన్న, కేదార్, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ సభ్యులు విక్రమ్, నేహ, ఫైనాన్స్ కమిటీ సభ్యులు పవన్


కుర్రా, శివ శంకర్ లింగం, వంశీ దాసరి, శ్రీనివాస్ ధామ, రామ్ బొల్లా, స్టేజ్ కమిటీ సభ్యులు శివ బత్తుల, టిట్లు మద్దిపట్ల, డెకరేషన్ కమిటీ సభ్యులు సురేంద్ర, సునీత అనగా తదితరులు పాల్గొన్నారు.