Play all audios:
దిల్లీ: తన ఏడేళ్ల కుమార్తెపై ఒక తండ్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో దోషిగా తేలిన అతడికి శిక్ష ఖరారైంది. తనకు విధించిన శిక్షను రద్దు చేయాలని దోషి సుప్రీంకోర్టులో (Supreme Court)
పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. మద్యం తాగిన తర్వాత మనిషి మృగంలా మారుతాడంటూ వ్యాఖ్యానించింది. ‘‘ఒక ఏడేళ్ల చిన్నారికి అతడు ఇలాంటి
పరిస్థితి కల్పించాడు. ఎవరూ కూడా తమ కుమార్తెలపై ఇలాంటి దారుణ చర్యకు పాల్పడరు. ఆ బాలికకు కన్న తండ్రిపై అబద్ధపు సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం ఏంటి..?ఆమె ఎంతో బాధను అనుభవించింది. మద్యం తాగిన
తర్వాత మనిషి మృగంలా మారుతాడు. అతడికి బెయిల్ ఇవ్వకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. దోషిగా తేలిన అతడికి శిక్ష నుంచి మినహాయింపు ఎలా కల్పించాలి’’ అని జస్టిస్ బీవీ. నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర
శర్మలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. దోషి చేసిన అభ్యర్థనను తిరస్కరించింది. * పాక్ నిఘా సంస్థ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి అరెస్ట్..! కార్డియాలజిస్ట్ అయిన ఒక వ్యక్తి భార్యతో
విడిపోయి వారణాసిలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన ఏడేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడి భార్యకు విషయం తెలియజేశాడు. కుమార్తెను తన వద్దకు తెచ్చుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన
వెలుగులోకి వచ్చింది. 2018 నాటి ఈ ఘటనలో నిందితుడిని న్యాయస్థానం దోషిగా తేల్చి శిక్ష విధించింది. దీనిపై సుప్రీంని ఆశ్రయించగా.. అతడి పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.