Ktr: మంత్రి కొండా సురేఖ వాస్తవాలు మాట్లాడారు: కేటీఆర్‌ ఎద్దేవా

Ktr: మంత్రి కొండా సురేఖ వాస్తవాలు మాట్లాడారు: కేటీఆర్‌ ఎద్దేవా

Play all audios:

Loading...

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఎట్టకేలకు వాస్తవాలు మాట్లాడారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కమీషన్‌


తీసుకోకుండా సంతకం చేయట్లేదని కాంగ్రెస్‌ మంత్రే చెప్పారన్నారు. ప్రభుత్వ కమీషన్ వ్యాపారాన్ని ఎత్తిచూపుతూ కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా కూడా చేశారని పేర్కొన్నారు. * నా వ్యాఖ్యలను


వక్రీకరించారు: మంత్రి కొండా సురేఖ డబ్బులు తీసుకుంటున్న మంత్రుల పేర్లు చెప్పాలని కొండా సురేఖను కేటీఆర్‌ కోరారు. సొంత పార్టీకి చెందిన మంత్రి చేసిన ఆరోపణలపై రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి


విచారణకు ఆదేశిస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌.. కమీషన్‌ సర్కార్‌ కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. (Telangana News) హరీశ్‌రావు నివాసానికి కేటీఆర్‌ మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు


నివాసానికి కేటీఆర్‌ వెళ్లారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, రాజకీయ పరిస్థితులపై సుమారు 2 గంటల పాటు వారు చర్చించారు. హరీశ్‌రావు తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్‌ అడిగి తెలుసుకున్నారు.