Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్ (IPL) సీజన్లో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) అదరగొడుతోంది. దిల్లీపై ఘన విజయాన్ని నమోదు చేసి ప్లేఆఫ్స్లోకి దూసుకెళ్లడమే కాకుండా.. గొప్ప రికార్డులను తన
ఖాతాలో వేసుకుంది. సాయి సుదర్శన్ (Sai Sudharsan), శుభ్మన్ గిల్ (Shubman Gill) ఓపెనింగ్ భాగస్వామ్యంతో ప్రత్యర్థులపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఆ జట్టు.. ఐపీఎల్లో చరిత్ర
సృష్టించింది. వికెట్ కోల్పోకుండా 200 పరుగులు ఛేజ్ చేసిన జట్టుగా నిలిచింది. దిల్లీతో ఆదివారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్లు సాయి సుదర్శన్,
కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. మరో బ్యాటర్కు పని చెప్పకుండా.. దిల్లీ నిర్దేశించిన లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఓపెనర్లు పూర్తి చేశారు. సాయి సుదర్శన్ (108) సెంచరీతో
అలరించగా.. గిల్ (93) కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ క్రమంలో గుజరాత్ పలు రికార్డులు నమోదు చేసింది. * దెబ్బకు మూడు బెర్తులు.. ప్లేఆఫ్స్లో గుజరాత్, బెంగళూరు, పంజాబ్ * ఐపీఎల్ చరిత్రలో
వికెట్ నష్టపోకుండా 200 కంటే ఎక్కువ పరుగులు ఛేదించిన జట్టుగా గుజరాత్ నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు కోల్కతా పేరిట ఉండేది. 2017 సీజన్లో గుజరాత్ లయన్స్పై వికెట్ నష్టపోకుండా కోల్కతా
184 పరుగులు ఛేదించింది. * ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ పరుగులు నమోదు చేసిన భారతీయ జంట కూడా గిల్, సుదర్శన్ జోడీయే. వీరు ఈ సీజన్లో ఇప్పటివరకు 839 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత ఈ
జాబితాలో శిఖర్ ధావన్, పృథ్వీ షా(744) జంట ఉంది. * అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేసిన జాబితాలో గిల్-సుదర్శన్ జంట మరోసారి చేరింది. గత సీజన్లో ఓ మ్యాచ్లో 210 పరుగులు నమోదు చేసిన ఈ
జంట రెండో స్థానంలో నిలవగా.. తాజాగా 205 పరుగులతో మూడో స్థానంలోనూ ఈ జంటే నిలిచింది. ఇక ఈ జాబితాలో 210 పరుగులతో కేఎల్ రాహుల్, డికాక్ (లఖ్నవూ-2022) జంట తొలి స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్లో 9
విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లి ప్లేఆఫ్ బెర్త్ ఖరారు చేసుకున్న గుజరాత్.. మరోసారి టైటిల్ సాధించే దిశగా సాగుతోంది.