Play all audios:
Published by: Last Updated:August 31, 2024 12:12 PM IST IPL 2025 : రెండు బౌన్సర్ల రూల్ను డొమెస్టిక్ క్రికెట్లో కీలకమైన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే
ఇప్పుడు ఈ రూల్ను బీసీసీఐ సమీక్షిస్తోంది. Two Bouncers: ప్రపంచ క్రికెట్లో మోస్ట్ సక్సెస్పుల్ లీగ్గా ఐపీఎల్ గుర్తింపు పొందింది. అయితే లీగ్ ఇంత సక్సెస్ అవ్వడానికి బీసీసీఐ ఎంతో కృషి
చేసింది. ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ప్రవేశపెడుతూ క్రికెట్ ఫ్యాన్స్కు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది. గత సీజన్ నుంచి అమల్లోకి వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్, ఓవర్కు రెండు బౌన్సర్ల నిబంధనలు
ఐపీఎల్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు బౌన్సర్ల రూల్ను డొమెస్టిక్ క్రికెట్లో కీలకమైన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రూల్ను బీసీసీఐ
సమీక్షిస్తోంది.ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అమలవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రూల్ అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. తాజాగా రెండు బౌన్సర్ల
రూల్ కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓవర్కు రెండు బౌన్సర్ల రూల్ కొనసాగించాలా? లేదా రద్దు చేయాలా? అనే దానిపై ఓ నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ సమీక్ష జరుపుతోంది.ఇంటర్నేషనల్ క్రికెట్
రూల్స్కు వ్యతిరేకంప్రముఖ క్రికెట్ సైట్ Cricbuzz రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో ఉన్న సింగిల్ ఓవర్ రెండు బౌన్సర్ల నిబంధనను బీసీసీఐ సమీక్షిస్తోంది. ఈ రూల్ అమలు
చేసినప్పుడు ఫ్రాంచైజీలు స్వాగతించాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్లో ఒక బౌన్సర్ వేయడానికి మాత్రమే అనుమతి ఉంది. అందుకే దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుని ఐపీఎల్
టీమ్స్కు తెలియజేస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా గతంలో చెప్పినట్లు క్రిక్బజ్ పేర్కొంది.‘ఇంపాక్ట్ ప్లేయర్, రెండు బౌన్సర్ల రూల్స్ కీలకమైనవి. వాటిని మేం అర్థం చేసుకున్నాం. ఇప్పటికైతే వీటిపై
ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీఈ సీజన్లో దేశీవాలీ టోర్నమెంట్ల కోసం బీసీసీఐ నిబంధనలు, మార్గదర్శకాలు, ప్లే కండిషన్స్
విడుదల చేసినప్పటికీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్కు సంబంధించిన ప్లేయింగ్ కండిషన్లను ఇంకా వెల్లడించలేదు. ఇంపాక్ట్ ప్లేయర్, టూ-బౌన్సర్స్ రూల్స్పై ఎటువంటి సమాచారాన్ని రాష్ట్ర క్రికెట్
సంఘాలకు ఇంకా తెలియజేయలేదు. నవంబర్లో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓవర్కు రెండు బౌన్సర్ల నిబంధనను కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాలంటే, మరికొన్ని
రోజులు వేచి చూడాల్సిందే.రద్దు చేయడానికే మొగ్గు?ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు పూర్తి భిన్నంగా ఉన్న ఓవర్కు రెండు బౌన్సర్ల రూల్ను బీసీసీఐ రద్దు చేయడానికే
మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నిబంధన బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆటపై ప్రభావం చూపుతోంది. బౌన్సర్ల కారణంగా బ్యాటర్లకు గాయాలు అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం
ఉంటుంది. మొత్తంగా ఆటలో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది. అందుకే ఈ రూల్ను బీసీసీఐ రివ్యూ చేస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అమలవుతున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్పై క్రికెట్ వర్గాల్లో పెద్ద
ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ రూల్ అవసరం లేదని కొందరు వాదిస్తున్నారు. తాజాగా రెండు బౌన్సర్ల రూల్ కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓవర్కు రెండు బౌన్సర్ల రూల్ కొనసాగించాలా? లేదా రద్దు చేయాలా?
అనే దానిపై ఓ నిర్ణయం తీసుకోవడానికి బీసీసీఐ సమీక్ష జరుపుతోంది. ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్కు వ్యతిరేకం ప్రముఖ క్రికెట్ సైట్ Cricbuzz రిపోర్ట్ ప్రకారం.. ఐపీఎల్, సయ్యద్ ముస్తాక్ అలీ
ట్రోఫీ(SMAT)లో ఉన్న సింగిల్ ఓవర్ రెండు బౌన్సర్ల నిబంధనను బీసీసీఐ సమీక్షిస్తోంది. ఈ రూల్ అమలు చేసినప్పుడు ఫ్రాంచైజీలు స్వాగతించాయి. అయితే అంతర్జాతీయ క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఒక ఓవర్లో ఒక
బౌన్సర్ వేయడానికి మాత్రమే అనుమతి ఉంది. అందుకే దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకుని ఐపీఎల్ టీమ్స్కు తెలియజేస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా గతంలో చెప్పినట్లు క్రిక్బజ్ పేర్కొంది. advertisement
‘ఇంపాక్ట్ ప్లేయర్, రెండు బౌన్సర్ల రూల్స్ కీలకమైనవి. వాటిని మేం అర్థం చేసుకున్నాం. ఇప్పటికైతే వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.’ అని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. త్వరలో సయ్యద్ ముస్తాక్
అలీ ట్రోఫీ ఈ సీజన్లో దేశీవాలీ టోర్నమెంట్ల కోసం బీసీసీఐ నిబంధనలు, మార్గదర్శకాలు, ప్లే కండిషన్స్ విడుదల చేసినప్పటికీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్కు సంబంధించిన ప్లేయింగ్ కండిషన్లను ఇంకా
వెల్లడించలేదు. ఇంపాక్ట్ ప్లేయర్, టూ-బౌన్సర్స్ రూల్స్పై ఎటువంటి సమాచారాన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇంకా తెలియజేయలేదు. నవంబర్లో ప్రారంభం కానున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓవర్కు రెండు
బౌన్సర్ల నిబంధనను కొనసాగిస్తారా లేదా రద్దు చేస్తారా అనే విషయంపై క్లారిటీ రావాలంటే, మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. advertisement రద్దు చేయడానికే మొగ్గు? ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే
అంతర్జాతీయ క్రికెట్ నిబంధనలకు పూర్తి భిన్నంగా ఉన్న ఓవర్కు రెండు బౌన్సర్ల రూల్ను బీసీసీఐ రద్దు చేయడానికే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఈ నిబంధన బౌలర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆటపై ప్రభావం
చూపుతోంది. బౌన్సర్ల కారణంగా బ్యాటర్లకు గాయాలు అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్యాటర్లను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా ఆటలో ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది. అందుకే ఈ రూల్ను
బీసీసీఐ రివ్యూ చేస్తోంది. Stay updated with the latest news, Download the News18 App to stay updated! Location : Hyderabad,Hyderabad,Telangana Andhra Pradesh Telangana Hyderabad,Telangana
First Published : August 31, 2024 12:12 PM IST Read More