Ktr: అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది: కేటీఆర్‌

Ktr: అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది: కేటీఆర్‌

Play all audios:

Loading...

మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌కు కవిత లేఖ రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కేసీఆర్‌కు కవిత లేఖ


రాయడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ స్పందించారు. పార్టీ అధినేతకు లేఖ రాయడం తప్పేమీ కాదన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందని, పార్టీ అధినేతకు సూచనలు చేయాలంటే లేఖలు రాయొచ్చని


తెలిపారు. ‘‘అంతర్గత విషయాలు.. అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. సమయం వచ్చినప్పుడు కోవర్టులు వారంతట వారే బయటపడతారు’’అని అన్నారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన


మీడియా సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ధ్వజమెత్తారు.  అధిష్ఠానానికి డబ్బులు ఇస్తూ సీఎం రేవంత్‌రెడ్డి పదవిని కాపాడుకుంటున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి మాటల


సీఎం కాదని, మూటల సీఎం అని విమర్శించారు. ‘‘రేవంత్‌రెడ్డికి దిల్లీలో ఇద్దరు బాస్‌లున్నారు. ఒకరు రాహుల్‌ గాంధీ, మరొకరు మోదీ. ఈడీ ఛార్జిషీట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పేరు ఉంది. దీనిపై రేవంత్‌,


రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించట్లేదు? ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేరున్న రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలి. గతంలో ఆరోపణలు వచ్చిన సీఎంలు, కేంద్రమంత్రులు పదవుల నుంచి తప్పుకొన్నారు. గత మేలో


తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ నడుస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మరి దానిపై విచారణ ఎందుకు చేయట్లేదు? సీఎం రేవంత్‌రెడ్డిని కాపాడుతున్నది కేంద్ర ప్రభుత్వమే. సంక్షేమ పథకాలు అమలు చేయకుండా


చేసిన అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి?’’అని ప్రశ్నించారు.