Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధానిలో ధూళి తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు, వడగళ్ల వానతో నగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్లు నేలకొరగడంతోపాటు
విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ అయింది. వివిధ మార్గాల్లో మెట్రో సేవలు నిలిచిపోయాయి. దిల్లీతోపాటు హరియాణా, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో అనేక చోట్ల భారీ వర్షం
కురిసింది. దిల్లీతోపాటు శివారు ప్రాంతాల్లో గంటకు 60-70కి.మీ వేగంతో గాలులు వీచినట్లు వాతావరణశాఖ వెల్లడించింది. లోదీ రోడ్లో వడగళ్ల వాన పడింది. సఫ్దర్జంగ్ ప్రాంతంలో గంటకు 79కి.మీ వేగంతో
ఈదురు గాలులు వీచినట్లు సమాచారం. భీకర గాలులకు చెట్లు ప్రమాదకరంగా ఊగిపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో దిల్లీ ఎయిర్పోర్టు సహా పలు విమానయాన
సంస్థలు ప్రయాణికులను అప్రమత్తం చేశాయి. ఈదురుగాలు, వర్షం కారణంగా విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశముందని సూచించాయి. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు సంబంధిత విభాగాలతో కలిసి
క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపాయి.