Play all audios:
ఇంటర్నెట్డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి కోల్పోయిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన ఆ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈమేరకు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు
వెలువడుతున్నాయి. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్, యూనస్ రాజీనామా గురించి ఓ మీడియాతో మాట్లాడారు. ‘యూనస్ రాజీనామా గురించి వచ్చిన వార్తలు నేను విన్నాను. దానిపై
చర్చించేందుకు ఆయన్ను కలిశాను. రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని యూనస్ నాతో చెప్పారు. దేశంలోని రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే తాను పనిచేయలేనని ఆయన వెల్లడించారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం
బలంగా ఉండాలని నేను ఆయనకు చెప్పాను. పార్టీలన్నీ ఐక్యంగా ఉండి ఆయనకు సహకరిస్తాయని ఆశిస్తున్నా. పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్ పదవిలో ఎలా కొనసాగుతారు?’ అని నహిద్ పేర్కొన్నారు. *
ఆహారాన్ని ఆయుధంగా మార్చుకోవడం నేరం.. డబ్ల్యూహెచ్వో చీఫ్ ఇటీవల యూనస్ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. అందులో బంగ్లా ఆర్మీ చీఫ్ జనరల్ వకార్- ఉజ్- జమాన్ (Waker-Uz-Zaman)తో నెలకొన్న
విభేదాలు ముఖ్యమైనవి. హసీనా రాజీనామా తర్వాత వీరు కలిసే ఉన్నప్పటికీ.. ఎన్నికల నిర్వహణ, సైనిక వ్యవహారాల్లో జోక్యంతో సహా యూనస్ తీసుకొంటున్న పలు నిర్ణయాల విషయంలో వీరి మధ్య విభేదాలు ఏర్పడినట్లు
తెలుస్తోంది. 2026 జూన్లో ఎన్నికలు జరుగుతాయని యూనస్ పేర్కొనడంపై దేశంలోని కొన్ని పార్టీలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. ఈక్రమంలోనే ఎన్నికల నిర్వహణపై ఇటీవల వకార్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు
చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు డిసెంబరులోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని తాత్కాలిక ప్రభుత్వానికి తెలిపారు. ఈ సందర్భంగా సైనిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనా ఆయన అభ్యంతరం
తెలిపారు. పదహారేళ్లపాటు కొనసాగిన షేక్ హసీనా ప్రభుత్వం గతేడాది ఆగస్టులో జరిగిన విద్యార్థుల ఉద్యమం వల్ల పతనమైంది. దీంతో పదవీచ్యుతురాలైన ఆమె.. స్వదేశాన్ని వీడి భారత్కు వచ్చి ఓ రహస్య ప్రాంతంలో
నివసిస్తున్నారు.