Mount everest: మౌంట్ ఎవరెస్టు వద్ద భారత పర్వతారోహకుడు మృతి

Mount everest: మౌంట్ ఎవరెస్టు వద్ద భారత పర్వతారోహకుడు మృతి

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్‌ శిఖరాన్ని (Mount Everest) అధిరోహించి.. కిందకి దిగుతుండగా ఓ భారతీయుడు మృతి చెందాడు. మృతుడిని పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబ్రతా ఘోష్‌గా


అధికారులు గుర్తించారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుబ్రాత్‌ ఘోష్‌ (45) తన గైడ్‌ చంపల్‌ తమంగ్‌తో కలిసి ఎవరెస్ట్‌ను అధిరోహించాడు. తిరిగివస్తుండగా.. ఘోష్‌కు


అనారోగ్య సమస్యలు తలెత్తాయి. హిల్లర్‌ స్టెప్‌ వద్ద నుంచి కిందకు రాలేకపోయాడు. ఈక్రమంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అతడి గైడ్‌ కిందకు చేరుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం సుబ్రత్‌


మృతదేహం  కిందకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక, ఈ సీజన్‌లో చోటుచేసుకున్న మరణాల్లో ఇది రెండోది. ఫిలిప్పీన్స్‌కు చెందిన 45 ఏళ్ల ఫిలిప్‌ 2 శాంటియాగో ఎవరెస్ట్‌ ఎక్కుతుండగా మరణించాడు.