Play all audios:
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణికులకు కాలం చెల్లిన శీతలపానీయాలు ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణలపై కేరళ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. తిరువనంతపురం: మంగళూరు- తిరువనంతపురం వందే భారత్
ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలులో ప్రయాణికులకు కాలం చెల్లిన శీతలపానీయాలు ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేరళ మానవ హక్కుల సంఘం సీరియస్గా స్పందించింది. ఈ ఘటనపై స్వయంగా కేసు నమోదు
చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసి 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని పాలక్కాడ్లోని డివిజనల్ రైల్వే మేనేజర్కు నోటీసులు జారీ చేసినట్లు హెచ్ఆర్సీ ఓ ప్రకటనలో పేర్కొంది. రైలులో అందించే శీతల
పానీయాల గడువు తేదీ దాటిపోయిందంటూ స్థానిక మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో ఈ తరహా చర్యలు చేపట్టింది. * బ్రహ్మోస్తో.. శత్రువుకు నిద్రలేని రాత్రులు : మోదీ ఆ కూల్ డ్రింక్ బాటిళ్లపై తయారీ తేదీ
గతేడాది సెప్టెంబర్ 25 ఉండగా.. ఎక్స్పైర్ డేట్ మాత్రం మార్చి 24, 2025గా ఉంది. అయితే, ప్రయాణికులు ఫిర్యాదు చేసినా.. క్యాటరింగ్ సిబ్బంది పట్టించుకోలేదంటూ ఆరోపణలు రావడంతో మానవహక్కుల కమిషన్
స్పందించి కేసు నమోదు చేసింది. ఈ కేసును జూన్ 26న విచారణ చేపట్టనుంది.