Play all audios:
తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్స్ అవార్డ్స్పై అగ్ర కథానాయకుడు మహేశ్బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: తెలుగు చలన చిత్ర పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్స్ అవార్డ్స్పై అగ్ర కథానాయకుడు మహేశ్బాబు, ప్రముఖ దర్శకుడు సుకుమార్ సంతోషం వ్యక్తం
చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘శ్రీమంతుడు’, ‘మహర్షి’, ‘మేజర్’ చిత్రాలకు గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతిష్టాత్మక గౌరవాన్ని
అందించటంతో పాటు, సినీ పండగకు చొరవ చూపితెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమాల వెనుక ఉన్న నా దర్శకులకు మరింత ప్రేమను పంచుతున్నా’’ అని పేర్కొన్నారు. బీఎన్ రెడ్డి
పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్ ‘‘ప్రతిష్ఠాత్మక గద్దర్ ఫిల్మ్ పురస్కారాల్లో బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ప్రకటించడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. నన్ను ఇంతటి గొప్ప
అవార్డుకు ఎంపిక చేయడం ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట ప్రభుత్వానికి గద్దర్ ఫిల్మ్ అవార్డు జ్యూరీకి నా కృతజ్క్షతలు. తెలుగు సినిమా రంగంలో శిఖరంలాంటి బీఎన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న
అవార్డు అందుకోవడం మరింత గౌరవం. నా చిత్రాల నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతలకు, నా చిత్రాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అని దర్శకుడు సుకుమార్ అన్నారు.