Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: విష్ణు విశాల్ (vishnu vishal), విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’ (lal salaam). రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya Rajinikanth)
దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మొయిద్దీన్ అనే కీలక పాత్రలో రజనీకాంత్ (Rajinikanth) నటించారు. గతేడాది ప్రారంభంలో థియేటర్లో విడుదలైన ఈ సినిమా ఎట్టకేలకు 16 నెలల తర్వాత ఓటీటీలోకి రానుంది.
ఎన్నో వాయిదాల అనంతరం ఓటీటీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. సన్ నెక్ట్స్ వేదికగా జూన్ 6 నుంచి అందుబాటులోకి రానుంది. * కొన్ని క్షణాలు మన హృదయంలో నిలిచిపోతాయి..: పూరీ జగన్నాథ్ కథేంటంటే:
ఇది పూర్తిగా 1990ల కాలంలో నడిచే కథ. హిందూ ముస్లింలు ఐకమత్యంగా సోదరభావంతో మెలిగే ఊరు కసుమూరు. అక్కడినుంచి ముంబయి వెళ్లి గొప్ప వ్యాపారవేత్తగా ఎదుగుతాడు మొయిద్దీన్ (రజనీకాంత్). తన కొడుకు
షంషుద్దీన్ (విక్రాంత్)ను క్రికెటర్ను చేయాలన్నది అతని కల. మొయిద్దీన్ ఊరు వదిలి వెళ్లాక కొందరు రాజకీయ నాయకుల కుట్రల వల్ల ఊళ్లోని ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోతారు. ఇక ఆ ఊళ్లో త్రీస్టార్ -
ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆట కూడా మతం రంగు పులుముకొని గొడవలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఒకరోజు మ్యాచ్ నడుస్తుండగా.. రెండు టీమ్స్ మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. (lal salaam
movie review) ఆ గొడవలోనే షంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం (విష్ణు విశాల్). ఇంతకీ ఆ గురు మరెవరో కాదు మొయిద్దీన్ ప్రాణ స్నేహితుడి (ఫిలిప్ లివింగ్స్టోన్) తనయుడే.
క్రికెట్లో జరిగిన ఆ గొడవ క్రమంగా మత కల్లోలంగా మారుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు క్రికెట్లో జరిగిన గొడవకు కారణమేంటి? అన్నది మిగతా కథ.