Play all audios:
హైదరాబాద్: ఏపీలోనూ సినీ అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ (Murali Mohan) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఆయన
మాట్లాడారు. ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు రావాలని.. ఒక ఏడాది తెలంగాణ, మరో ఏడాది ఏపీ ప్రభుత్వాలు
పురస్కారాలను ప్రకటించాలని సూచించారు. ‘‘తెలంగాణలో ఈ సినిమాకు.. ఆంధ్రాలో ఆ సినిమాకు అవార్డు ఇచ్చారనేది వివాదానికి దారితీస్తుంది. తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి. ఒక రాష్ట్రం ఎక్కువ..
మరో రాష్ట్రం తక్కువ కాదు. సినిమాకు సంబంధించి తెలుగు ప్రేక్షకులంతా ఒకటే. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతున్నాయి. తెలుగు సినిమాలను మనకంటే ముందు అమెరికా వాళ్లు చూస్తున్నారు’’ అని
మురళీమోహన్ అన్నారు.