Play all audios:
Nithin Kamath on diabetes: డయాబెటిస్ గురించి జెరోధా సీఈఓ నితిన్ కామత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే స్పందించకుంటే ముప్పు తప్పదని వ్యాఖ్యానించారు. Nithin Kamath on diabetes | ఇంటర్నెట్
డెస్క్: దేశంలో డయాబెటిస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. చిన్న వయసులోనూ చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు. దీనిపై జెరోధా సహ వ్యవస్థపాకుడు, సీఈఓ నితిన్ కామత్ ఆందోళన వ్యక్తంచేశారు. భారత్
డయాబెటిస్కు కేంద్ర స్థానంగా మారుతోందన్నారు. ఇటీవల ఓ శీతలపానీయ సంస్థ ఎర్నింగ్ కాల్కు వెళ్లి వచ్చాక దీనిపై స్పందించారు. ఒకప్పటితో పోలిస్తే భారతీయులు ఎప్పుడూలేని స్థాయిలో శీతల పానీయాలు
తాగుతున్నారని, ఇది ఆందోళనకర పరిణామమంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేశారు. డయాబెటిస్ గురించి గతంలోనూ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ప్రపంచంలోనే మరే దేశంలోనూ లేని స్థాయిలో మన దేశంలో మధుమేహులు
ఉన్నారని పేర్కొన్నారు. మధుమేహం ఒకప్పుడు ధనికులకే అనే అపోహ ఉండేదని, అది ఏమాత్రం నిజం కాదన్నారు. దేశంలో దాదాపు 21 కోట్ల మంది జనాభా దీని బారిన పడినట్లు ఓ అధ్యయనంలో తేలిందన్నారు. ముఖ్యంగా యువ
జనాభాలో వేగంగా విస్తరిస్తోందన్నారు. నగరంలో ఉండే 20 ఏళ్ల యువతి అయితే, జీవితకాలంలో డయాబెటిస్ వచ్చే అవకాశం 64.6 శాతంగా ఉందని, అదే యువకుల్లో అయితే 55.5% ముప్పు పొంచి ఉందన్నారు. అంతేకాదు 27.5%
మంది డయాబెటిస్ ఉన్న సంగతి కూడా తెలీదని పేర్కొన్నారు. తెలిసిన వారిలోనూ కొందరే చికిత్స తీసుకుంటున్నరని చెప్పారు. * ఎయిర్టెల్ యూజర్లకు ఫ్రీగా ‘ఫ్రాడ్ డిటెక్షన్’ సదుపాయం చిన్న వ్యాయామాలతో..
దేశంలో 20 శాతం మంది భారతీయులకే ఆరోగ్య బీమా ఉందని, ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుందని కామత్ అభిప్రాయపడ్డారు. దీంతో చాలా మంది భారతీయులు తమ జేబులోంచి ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. ఈ
సమస్యను పరిష్కరించడానికి ప్రజా అవగాహన కార్యక్రమాలు, పేదలకు బీమా కవరేజీ వంటివి అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలు కూడా తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. రోజూ కొన్ని నిమిషాలు
వ్యాయామం చేయడం లేదా కూర్చునే సమయాన్ని తగ్గించడం వంటివి పెద్ద మార్పును తీసుకొస్తాయన్నారు. రోజుకు ఐదు నిమిషాలు నడవడం లేదా సైక్లింగ్ చేయడం వంటి చిన్న మార్పులు కూడా డయాబెటిస్ రాకను
తగ్గించగలవన్నారు. స్టార్టప్ సంస్థల నుంచి ప్రభుత్వాల వరకు అందరూ కలిసి ఈ సవాలును అధిగమించాల్సి ఉందని నితిన్ కామత్ అభిప్రాయపడ్డారు.