Play all audios:
వెల్దుర్తి: పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం బోదలవీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెదేపా నేతలు మృతి చెందారు. గుండ్లపాడుకు చెందిన వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు ద్విచక్రవాహనంపై
వెళ్తుండగా.. స్కార్పియో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఢీకొన్న స్కార్పియో వాహనం తెదేపా నేత వెంకట్రామయ్యదిగా గుర్తించారు. తెదేపాలోని రెండు వర్గాల మధ్య
కొన్నాళ్లుగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. వెంకట్రామయ్య వర్గం ఇటీవలే వైకాపా నుంచి తెదేపాలోకి వచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.