Hyderabad: గుల్జార్‌హౌస్‌ ఘటన.. పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Hyderabad: గుల్జార్‌హౌస్‌ ఘటన.. పరిహారం ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

Play all audios:

Loading...

చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌ రాజనర్సింహాతో కలిసి ఉపముఖ్యమంత్రి


భట్టి విక్రమార్క ఘటనాస్థలిని పరిశీలించారు. హైదరాబాద్‌: చార్మినార్‌ గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం


ప్రకటించింది. మృతులకు ఒక్కొక్కరికి రూ. 5లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, దామోదర్‌


రాజనర్సింహాతో కలిసి ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘‘ఈ ఘటనపై అన్ని శాఖల అధికారులతో చర్చిస్తూ,


ఎప్పటికప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ ద్వారా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు చెబుతున్నారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక సిబ్బందికి ప్రమాదం


గురించి సమాచారం అందింది. వెంటనే 6.17కి మొగల్‌పుర ఫైర్‌ ఇంజిన్‌ సిబ్బంది బయలుదేరి 6.20గంటలకు ప్రమాదస్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. ఈక్రమంలో మొత్తం 11 ఫైర్‌ ఇంజిన్లతోపాటు ఒక రోబోను


ఉపయోగించారు. 70 మంది ఫైర్‌ సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరగకుండా నియంత్రించగలిగారు. ఈ ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని


డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.