Play all audios:
హైదరాబాద్: రైతులకు మంచి రోజులు వస్తున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రమైన తెలంగాణ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుందని చెప్పారు.
వాటిని అధిగమించి సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) రుణమాఫీ చేశారన్నారు. గతేడాది మొదటి పంట కాలంలోనే రైతుల ఖాతాల్లో రూ.33 వేల కోట్లు వేశారన్నారు. దేశంలోనే అత్యధిక ధాన్యం సేకరించిన రాష్ట్రం
తెలంగాణ అని చెప్పారు. అనుకున్న సమయానికే రైతుభరోసా నిధులు వేస్తామని హామీ ఇచ్చారు. అతి త్వరలోనే నల్గొండ జిల్లాలో పామాయిల్ పరిశ్రమ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. (Telangana News)