Fire accident: చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయి: అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి

Fire accident: చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు వ్యాపించాయి: అగ్నిమాపక డీజీ నాగిరెడ్డి

Play all audios:

Loading...

హైదరాబాద్‌: విద్యుదాఘాతం వల్లే గుల్జార్‌హౌస్‌ చౌరాస్తా సమీపంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఇంటిలో చెక్కతో చేసిన ప్యానెళ్ల వల్లే మంటలు


వ్యాపించాయన్నారు. విద్యుదాఘాతంతో చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు. ‘‘మొదటి అంతస్తులో ఉన్న 17 మందిని ఆసుపత్రికి తరలించాం. నిచ్చెన ద్వారా నలుగురు పైనుంచి కిందికి వచ్చారు. భవనంలో


విద్యుత్‌ సరఫరాకు సంబంధించిన మెయిన్‌ వద్ద నిత్యం విద్యుదాఘాతం జరుగుతోందని కార్మికులు చెబుతున్నారు. అగ్నిప్రమాద నివారణకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు’’ అని నాగిరెడ్డి తెలిపారు.


(Telangana News)